తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ (EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని జేఎన్టీయూలో ఫలితాలను విడుదల చేశారు. ఈ మేరకు విద్యార్థులు eapcet.tgche.ac.in వెబ్సైట్లో ర్యాంకులను తెలుసుకోవచ్చు.
ఈ సంవత్సరం పరీక్ష రాసిన వెంటనే ప్రాథమిక ‘కీ’ ఆధారంగా కంప్యూటర్ స్క్రీన్పైనే మార్కులు కనిపించేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అదే కాదు పరీక్షలు పూర్తయిన కేవలం ఆరో రోజే ఫలితాలను విడుదల చేస్తుండటం విశేషం. ఇక ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎప్ సెట్ ఫలితాలలో ఉప్పల్ కు చెందిన ఎం. రుషి ఫస్ట్ ర్యాంక్ (156.64/160) సాధించగా.. మూసాపేటకు చెందిన అన్షుల్ రెండో ర్యాంక్ సాధించారు.