Find Articles

మోదీ ఐడియాతో ‘ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ మూవీ!

ఈషా ఫేం త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది.

ఇటీవల ప్రధాని మోదీ ‘ వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమనే ట్రెండ్ కు పిలుపునిచ్చారు.అయితే దానికి ముందే ఈ సినిమా అదే కాన్సెప్ట్ తో తీయడం విశేషం. ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు.? వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు.? అనేది ఈ సినిమాలో చూపించారు.

దర్శకుడు మధుదీప్ చెలికాని మంచి కాన్సెప్ట్ ను ఎంచుకున్నారు. నార్మల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఐటీ ఉద్యోగుల కథ అని భావిస్తారు. కానీ ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ ను వ్యవసాయానికి కలిపి చూపించడం కొత్తగా అనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే షుగర్, బీపీ, గుండె జబ్బులతో బాధపడుతున్నారు. దీనికి కారణం మనం తీసుకుంటున్న ఫుడ్ అని ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు. పాతకాలంలో సహజ పద్దతుల్లో పండించిన ఆహారం తినేవారని, అందుకే ఆరోగ్యంగా ఉండేవారని చూపించారు.సినిమాలోని కొన్ని సీన్స్ ఆడియెన్స్ ను ఆలోచింపజేసేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రైతుల జీవితం, టెక్నాలజీ ద్వారా వ్యవసాయంలో మార్పులు తీసుకురావడం వంటి అంశాలు బాగున్నాయి. కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదిగా సాగినా మొత్తం మీద సినిమా మెసేజ్ బాగుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఒక్కమాటలో చెప్పాలంటే, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కేవలం ఎంటర్ టైన్ మెంట్ సినిమా మాత్రమే కాదు.రైతులు, ఆరోగ్యం, సహజ వ్యవసాయం గురించి ఆలోచింపజేసే సినిమా.

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *