Find Articles

అమెరికాలో అరుదైన గౌరవం అందుకున్న రోజా కూతురు…

స్టార్ నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆమె కుమార్తె అన్షు మాలిక సెల్వమణి అరుదైన రికార్డ్ సాధించారు. దీంతో వారి కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

భారత్ లో ఇప్పటివరకూ ఎవరు సాధించలేని అరుదైన అవార్డును అన్షు మాలిక గెలుచుకున్నారు. ఇండియానా యూనివర్సిటీలో అత్యంత ప్రెస్టేజియస్ గా భావించే “హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్ అవార్డు” అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా ఆమె గుర్తింపు పొందింది. అన్షు మాలిక ప్రస్తుతం అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీలో లడ్డి స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటింగ్ అండ్ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో చదువుతున్నారు. ఓ వైపు చదువులో రాణిస్తూనే, మరోవైపు లీడర్షిప్ క్వాలిటీస్ చూపించిన బెస్ట్ స్టూడెంట్ గా ఈ అవార్డును అందుకున్నారు.

అన్షు మాలిక ఇది మాత్రమే కాదు.. చాలా ఘనతలను సాధించారు. చదువుకుంటూనే పలు ప్రెస్టేజియస్ అవార్డులను కూడా అందుకున్నారు. మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు ఫర్ ఈక్విటీ అండ్ టెక్నాలజీ, లడ్డి అకాడెమిక్ ఎక్సలెన్స్ అవార్డు, డీన్ లిస్ట్ గుర్తింపులు, ఫౌండర్స్ స్కాలర్ వంటి అనేక గౌరవాలు ఆమె ఖాతాలో ఉండగా.. వాటితో పాటు గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు 2024, గ్లోబల్ ఇంపాక్ట్ అడ్వకేట్ అవార్డు 2025 వంటి గుర్తింపులు కూడా ఆమె సాధించారు.

 

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *